ఎగ్జిట్ పోల్స్ లైవ్..
x

ఎగ్జిట్ పోల్స్ లైవ్..

పశ్చిమ బెంగాల్‌, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు..


Click the Play button to hear this message in audio format

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికలు నేటితో ముగిశాయి. రెండో దశలో బెంగాల్‌లో రికార్డు స్థాయిలో 90 శాతం ఓటింగ్ నమోదైంది. కేరళ, అస్సాంలలో అధికార ప్రభుత్వాలు తమ పట్టును నిలుపుకోనున్నాయా? తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో హోరాహోరీగా సాగిన ప్రచారాలు ఓటర్లను ప్రభావితం చేశాయా, పుదుచ్చేరి కీలక పోరులో ఎవరికి ఆధిక్యం ఉంది అన్నది త్వరలో తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.

సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఈ అంచనాలు ప్రస్తుత ప్రభుత్వాల పరిస్థితిపై మొదటి సంకేతాలు ఇస్తాయి. కేరళ, అస్సాంలో అధికార పార్టీలు తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయా అనే విషయం తెలిసే అవకాశం ఉంది. అలాగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన గట్టిపోటీ ప్రచారం ఓటర్లపై ఎలా ప్రభావం చూపిందో కూడా అర్థమవుతుంది. పుదుచ్చేరి పోరులో ఎవరు ముందంజలో ఉన్నారో కూడా ఈ అంచనాలు సూచించవచ్చు. అయితే అసలు ఫలితాలు మే 4న ఓట్ల లెక్కింపు తర్వాత మాత్రమే స్పష్టమవుతాయి. అప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలు కొనసాగనున్నాయి.

Live Updates

  • 29 April 2026 7:27 PM IST

    డీఎంకేకు జై కొట్టిన చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్..

    చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. డీఎంకేకు భారీ మెజారిటీని వస్తుందని అంచనా వేసింది. 234 స్థానాలున్న అసెంబ్లీలో డీఎంకే నేతృత్వంలోని కూటమి 145 నుంచి 160 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఏఐఏడీఎంకేకు 50 నుంచి 65 స్థానాలు మాత్రమే దక్కవచ్చని అంచనా. టీవీకే‌కు 13 నుంచి 18 స్థానాలు రావచ్చని సూచించింది. ఇతరులు 5 నుంచి 8 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.

    మూడు ప్రధాన ఎగ్జిట్ పోల్స్‌ను పోల్చితే, డీఎంకేకు అత్యధిక అంచనాను చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చింది. పీపుల్స్ పల్స్ 125 నుంచి 145 స్థానాలు, మ్యాట్రైజ్ 122 నుంచి 132 స్థానాలు అంచనా వేయగా, చాణక్య గరిష్టంగా 160 స్థానాలు రావచ్చని పేర్కొనడం విశేషం. ఇది దాదాపు చారిత్రాత్మక విజయం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఏఐఏడీఎంకే విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ మధ్య గణనీయమైన తేడాలు కనిపిస్తున్నాయి. మ్యాట్రైజ్ 87 నుంచి 110 స్థానాలు అంచనా వేయగా, పీపుల్స్ పల్స్ 65 నుంచి 80, చాణక్య స్ట్రాటజీస్ 50 నుంచి 65 స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపింది. టీవీకేకు మూడు పోల్స్‌లో 10 నుంచి 24 స్థానాల మధ్య అంచనాలు ఉన్నాయి.

    మొత్తం మీద మూడు ఎగ్జిట్ పోల్స్ ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయంగా ఉన్నాయి. డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. అయితే మే 4న వెలువడే అసలు ఫలితాల్లో ఆ మెజారిటీ ఎంత భారీగా ఉంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

  • 29 April 2026 7:22 PM IST

    కేరళం లో ఎగ్జిట్ పోల్స్ చూపిస్తున్న దృశ్యం ఇది

    కేరళలో మొత్తం ( 140) మ్యాజిక్ ఫిగర్ (71)

    P MARQ ఎగ్జిట్ పోల్స్ సర్వే : మ్యాజిక్ ఫిగర్ 71

    • UDF (కాంగ్రెస్ కూటమి) 72 నుంచి 79 స్థానాలు

    • LDF ( పినరయ్ విజయ్ కూటమి) 62 నుంచి 69 స్థానాలు

    • ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది

    యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ : మ్యాజిక్ ఫిగర్ 71

    UDF (కాంగ్రెస్ కూటమి) 78 నుంచి 90 స్థానాలు

    LDF ( పినరయ్ విజయ్ కూటమి) 49 నుంచి 62 స్థానాలు

    బీజేపీ ఒకటి నుంచి 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశం

    పీపుల్స్ పల్స్‌ సర్వే

    ఎల్డీఎఫ్‌ 55 -65

    యూడీఎఫ్‌ 75-87

    ఎన్డీయే 0-3

    మ్యాట్రిజ్

    ఎల్డీఎఫ్ : 60-65

    • యూడీఎఫ్ : 70-75

    • బీజపీ : 3-5

    • ఎల్డీఎఫ్ : 60-65

    • యూడీఎఫ్ : 70-75

    • బీజపీ : 3-5

  • 29 April 2026 7:19 PM IST

    మ్యాట్రైజ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం తమిళనాడులో మళ్లీ డీఎంకేనే..

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై మరో ఎగ్జిట్ పోల్ పోటీ మరింత హోరాహోరీగా ఉండొచ్చని సూచిస్తోంది.

    మ్యాట్రైజ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. 234 స్థానాలున్న అసెంబ్లీలో డీఎంకే కూటమి 122 నుంచి 132 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇది మెజారిటీ అయినప్పటికీ, పీపుల్స్ పల్స్ అంచనా వేసిన 125 నుంచి 145 స్థానాలతో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉంది.

    మ్యాట్రైజ్ ప్రకారం ఏఐఏడీఎంకే 87 నుంచి 110 స్థానాలు గెలుచుకునే అవకాశముంది, ఇది పీపుల్స్ పల్స్ అంచనా (65 నుంచి 80 స్థానాలు) కంటే చాలా మెరుగ్గా ఉంది.

    అలాగే టీవీకేకు మ్యాట్రైజ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం 10 నుంచి 12 స్థానాలు మాత్రమే రావచ్చని సూచించింది. ఇది పీపుల్స్ పల్స్ అంచనా వేసిన 18 నుంచి 24 స్థానాలతో పోలిస్తే తగ్గుదల. ఇతరులు 0 నుంచి 6 స్థానాలు గెలుచుకునే అవకాశముందని పేర్కొంది.

  • 29 April 2026 7:17 PM IST

    బీజేపీ దుర్వినియోగం చేసింది: టీఎంసీ 

    ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన వెంటనే, పశ్చిమ బెంగాల్‌లో ప్రజా మద్దతు కంటే బిజెపి కేంద్రం సంస్థలపైనే ఎక్కువగా ఆధారపడుతోందని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.

    సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో, ఆ పార్టీ ఇలా పేర్కొంది, “బెంగాల్‌లో బీజేపీకి ఓటర్లు లేరు. అందుకే ఎలాగోలా గట్టెక్కడానికి వారు ఎన్నికల సంఘం, కేంద్ర బలగాలు, కేంద్ర ఏజెన్సీల యంత్రాంగంపై ఆధారపడుతున్నారు.” ఎగ్జిట్ పోల్ అంచనాలు విడుదలైన కొద్ది నిమిషాలకే ఈ వ్యాఖ్యలు రావడం, రాబోయే కాలంలో మరింత తీవ్రమైన రాజకీయ వాదోపవాదాలకు నాంది పలికింది.

    పోలింగ్ సమయంలో విస్తృతంగా బెదిరింపులు జరిగాయని కూడా ఆరోపించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి, "యూనిఫాంలో ఉన్న అమిత్ షా 'గూండా బాహినీ' విచ్చలవిడి హింస, ఆసన్నమైన ఓటమిని ఎదుర్కొంటున్న పార్టీకి ప్రతిబింబిస్తుంది" అని ఆ పార్టీ పేర్కొంది. అన్ని వర్గాల ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నారని కూడా టిఎంసి ఆరోపించింది. "బెంగాల్ గొంతును అణచివేసే ప్రయత్నంలో వారు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు, మహిళలు, వృద్ధులు, రోగులు మరియు పిల్లలపై కూడా వేధింపులకు, దాడులకు పాల్పడ్డారు," అని పేర్కొంది.

    ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ, ఫలితంపై పార్టీ నిశ్చయతను వ్యక్తం చేసింది. "కానీ ఎంత బెదిరింపులు, హింస, లేదా భయం కూడా ప్రజల తీర్పు నుండి బీజేపీని కాపాడలేవు," అని పేర్కొంది.

  • 29 April 2026 7:14 PM IST

    పోల్ డైరీ ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకే మెజార్టీ స్థానాలు

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్‌లో విభిన్న అంచనాలు వెలువడుతున్నాయి. ముందుగా పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ టీఎంసీకి భారీ విజయాన్ని అంచనా వేయగా, తాజాగా పోల్ డైరీ ఎగ్జిట్ పోల్ పూర్తిగా భిన్నమైన ఫలితాలు ఇచ్చింది.

    పోల్ డైరీ అంచనాల ప్రకారం.. 294 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 142 నుంచి 171 స్థానాలు గెలుచుకుని మెజారిటీ సాధించే అవకాశం ఉంది. ఇదే సమయంలో టీఎంసీకు 99 నుంచి 127 స్థానాలు మాత్రమే దక్కవచ్చని సూచించింది.

    ఇతర పార్టీల విషయానికి వస్తే, కాంగ్రెస్‌కు 3 నుంచి 5 స్థానాలు, వామపక్షాలకు 2 నుంచి 3 స్థానాలు, ఇతరులకు గరిష్టంగా 1 స్థానం లభించే అవకాశం ఉందని తెలిపింది.

    ఇది పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్‌కు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఆ ఎగ్జిట్ పోల్ టీఎంసీకి 177 నుంచి 187 స్థానాలు, బీజేపీకి 95 నుంచి 110 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేసింది.

    రెండు ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా భిన్నమైన ఫలితాలను చూపించడం ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అసలు ఫలితాలు మే 4న వెల్లడికానున్నాయి.

  • 29 April 2026 7:12 PM IST

    తమిళనాడులో...

    ఇక్కడ డిఎంకె, ఎఐడిఎంకె మధ్య హోరా హోరు పోరు సాగింది. కొత్త పార్టీ టివికె ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఈ పార్టీకి 15 శాతం ఓట్లు వచ్చాయి. డిఎంకె కు 39 శాతం ఓట్లు పోలయ్యాయి, ఎఐడిఎంకెకి 40 శాతం పోలయ్యాయి

  • 29 April 2026 7:12 PM IST

    కేరళలో అన్ని సంస్థల అంచనాలు ఒకే వైపు..

    కేరళ అసెంబ్లీ ఎన్నికలపై పలు సంస్థలు తమ అంచనా ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాయి. అన్ని చెప్తున్నది ఒకే మాట.. ఈసారి పినరయి విజయన్ ఓటమి తథ్యమని. ఈసారి కేరళంలో కాంగ్రెస్ సమ్యుక్త యూడీఎఫ్ జెండా రెపరెపలాడటం ఖాయమని.

    ఆక్సిస్ మై ఇండియా

    యూడీఎఫ్ - 78-90 సీట్లు

    ఎల్‌డీఎఫ్ - 49-62 సీట్లు

    ఇతరులు - 0-3 సీట్లు

    పీ-మార్క్

    యూడీఎఫ్ - 72-79 సీట్లు

    ఎల్‌డీఎఫ్ - 62-69 సీట్లు

    ఇతరులు - 0-3 సీట్లు

  • 29 April 2026 7:10 PM IST

    అస్సాంలో ఈ సారి కూడా కాషాయ జెండానే..

    అస్సాం అసెంబ్లీ ఎన్నికలపై మరో ఎగ్జిట్ పోల్ కూడా బీజేపీ భారీ విజయాన్ని సూచిస్తోంది. పోల్ డైరీ నిర్వహించిన తాజా ఎగ్జిట్ పోల్ ప్రకారం.. 126 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి 86 నుంచి 101 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ కు 15 నుంచి 26 స్థానాలు మాత్రమే దక్కవచ్చని అంచనా. ఈ అంచనాలు ముందుగా వచ్చిన Axis My India ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సమానంగా ఉండటం గమనార్హం. ఈ అంచనాలు నిజమైతే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి స్పష్టమైన మెజారిటీతో అధికారంలో కొనసాగనుంది. కాగా, అధికారిక ఫలితాలు మే 4న ప్రకటించబడనున్నాయి.

  • 29 April 2026 7:08 PM IST

    పశ్చిమబెంగాల్ లో బిజెపి ఆధిక్యత


    ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మొదటి విడత పోలింగ్ లో టిఎంసి, బిజెపి మధ్య హోరోహోరు సాగింది.  రెండో విడత పోలింగ్ ఇంకా నడుస్తున్నందున, ఎగ్జిట్ పోల్ ఫలితాలు మొదటి దశ వరకే అందుబాటులో ఉన్నాయి. ఇందులో పీపుల్స్ పల్స్ తప్ప మిగతా పోల్స్ మొత్తం బెంగాల్ లో బిజెపికే ఆధిక్యత ఇస్తున్నాయి. పీపుల్స్ పోల్స్ బిజెపికి 95 -110 సీట్లు ఇస్తే, తృణమూల్ కాంగ్రెస్ కు  117 నుంచి 187 దాకా  ఇచ్చింది. మిగతా పోల్స్ జెవిసి, చాణక్య స్ట్రాటజీస్,పోల్ డెయిరీ మాత్రిజ్ బజెపికి ఆధిక్యత ఇచ్చాయి. 


  • 29 April 2026 7:07 PM IST

    వెస్ట్ బెంగాల్‌లో మళ్లీ టీఎంసీ?

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌లో కీలక అంచనాలు వెలువడ్డాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. 294 స్థానాలున్న అసెంబ్లీలో టీఎంసీ (All India Trinamool Congress) 177 నుంచి 187 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది 148 మెజారిటీ మార్క్‌ కంటే చాలా ఎక్కువగా ఉంది.

    ఇదే సమయంలో బీజేపీ (Bharatiya Janata Party)కి 95 నుంచి 110 స్థానాలు రావచ్చని అంచనా. కాంగ్రెస్‌కు కేవలం 1 నుంచి 2 స్థానాలు మాత్రమే లభించే అవకాశం ఉంది. అలాగే వామపక్షాలకు 0 నుంచి 1 స్థానమే దక్కవచ్చని ఎగ్జిట్ పోల్ సూచిస్తోంది.

    ఈ అంచనాలు నిజమైతే..ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అవుతుంది. కాగా, అసలు ఫలితాలు మే 4న ప్రకటించబడనున్నాయి.

Read More
Next Story