‘యోగా’ సరిహద్దులు, సంస్కృతులకు అతీతంగా మారింది: మోదీ
x
ప్రధాన నరేంద్ర మోదీ

‘యోగా’ సరిహద్దులు, సంస్కృతులకు అతీతంగా మారింది: మోదీ

20 లో కంటే 40 లలో చురుకుగా ఉండటమే మన లక్ష్యం కావాలన్న ప్రధాని


Click the Play button to hear this message in audio format

యోగా ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుకగా మారిందని, ఇది దేశాలు, సంస్కృతులకు అతీతంగా ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అన్నారు.

కోల్‌కతాలో జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. భూమిపై అత్యంత సుదీర్ఘమై రోజు అయిన జూన్ 21 ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగా దినంగా గుర్తింపు పొందిందని మోదీ అన్నారు. "భూమిపై అత్యంత పొడవైన రోజుగా నిలిచే జూన్ 21, యోగా కారణంగా ఇప్పుడు అతిపెద్ద సామూహిక వేడుక దినంగా మారింది.
యోగా ప్రజలను ఏకం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రపంచ ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను" అని ఆయన అన్నారు. 'స్వచ్ఛత సే స్వాగత్' కార్యక్రమాన్ని అంకితభావంతో కొనసాగిస్తున్న కోల్‌కతా ప్రజలను కూడా ప్రధాని అభినందించారు.
ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తమైన 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా' అని ప్రస్తావిస్తూ, ఈ ప్రాచీన అభ్యాసం శారీరక ఆరోగ్యం, మానసిక శ్రేయస్సు చురుకైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, తద్వారా జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని మోదీ అన్నారు.
"యోగా కేవలం శారీరక వ్యాయామం కాదు. ఇది ఏ వయస్సు వారికీ పరిమితం కాదు. ఇది మానవ స్ఫూర్తికి ఒక వ్యక్తీకరణ" అని ఆయన అన్నారు. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, వయసు పెరగడం వల్ల మానవ సామర్థ్యం తగ్గకుండా చూసేందుకు కృషి చేయాలని మోదీ అన్నారు. "ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా గురించి మాట్లాడుతూ.. వయసు మానవ సామర్థ్యాన్ని తగ్గించకుండా చూసేందుకు మనం కృషి చేయవచ్చు" అని ఆయన అన్నారు.
"20 ఏళ్ల వయసులో ఉన్నప్పటి కంటే 40 ఏళ్ల వయసులో మరింత చురుకుగా ఉండటమే మన లక్ష్యం. 30 ఏళ్ల వయసులో ఉన్నప్పటి కంటే 50 ఏళ్ల వయసులో మరింత శక్తివంతంగా ఉండాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం" అని ఆయన చెప్పారు. ప్రజలు యోగాను కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలకే పరిమితం చేసుకోకూడదని, దానిని ప్రజల జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కూడా ప్రధాని కోరారు.


Read More
Next Story