గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో భారీ మార్పులు
x

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో భారీ మార్పులు

వాలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పుల గురించి మంత్రివర్గ సమావేశం చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. మద్యం పాలసీపై నిర్ణయం తీసుకున్నారు.


వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ప్రభుత్వ శాఖలతో సమీకృతం చేస్తూ ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ అయింది. క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాలు, ఆమోదం తెలిపిన అంశాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్రంలో మొత్తం 2.63 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వారిలో 1.07 లక్షల మంది రాజీనామా చేశారు. 2023 ఆగస్టు 15 తర్వాత వాలంటీర్ల సేవలను పొడిగించలేదు. వాలంటీర్లు సర్వీస్ లో ఉన్నారో, లేదో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఏదేమైనా సమగ్ర నివేదికతో రావాలని సంబంధిత శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇక, వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలుకు సంవత్సరానికి గత ప్రభుత్వంలో రూ.102 కోట్లు ఖర్చు చేశారు. దినపత్రిక కొనుగోలుపై విచారణకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఇంటింటికి వెళ్లి 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలన గురించి వివరించేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. నూతన మద్యం విధానంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. అందుబాటులోకి నాణ్యమైన మద్యం బ్రాండ్లు... సగటు మద్యం ధర రూ. 99గా నిర్ణయించారు. భోగాపురం ఎయిర్ పోర్టు పేరును మార్చేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ‘స్టెమీ' పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆధార్ తరహాలో విద్యార్థులకు 'అపార్' గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేలా చర్యలు చేపట్టేందుకు నిర్ణయం.

రాష్ట్ర హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు... కార్పస్ ఫండ్ గా రూ.10 కోట్లు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి డీమ్డ్ హోదా ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1,000 కోట్లతో రాష్ట్రంలో బిట్స్-పిలానీ విద్యాసంస్థ స్థాపనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి సిఫారసు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కౌలు కార్డుల నమూనా మార్చాలని క్యాబినెట్ నిర్ణయం. రైతు సంతకం అవసరం లేకుండానే కౌలు కార్డులను జారీ చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు పాత ఏజెన్సీకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. వివరాలను పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించారు.

Read More
Next Story