తిరుపతి శ్రీవేంకటేశ్వర హైస్కూల్ ఆవరణలో మంగళవారం ఆర్చరీ పోటీలు ప్రారంభిస్తున్న శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు.

స్పోర్ట్స్ డెస్టినేషన్ తిరుపతి: నగరంలో యువ క్రీడా రత్నాల సంగమం

హోరాహోరీగా సాగుతున్న క్రీడా పోటీలను వివరించే వీడియో కథనం.


తిరుపతి నగరం క్రీడలకు పదును పెట్టే వేదికగా నిలిచింది. అమరావతి ఛాంపియన్‌షిప్–2026 రాష్ట్రస్థాయి నాలుగు రోజుల పోటీలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రీడలకు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ (Asia Book of Records ) లో ఆంధ్రప్రదేశ్ మల్టీ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ నమోదుతో కొత్త రికార్డు సృష్టించింది.


రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం వల్ల ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అధికారికంగా స్థానం సంపాదించింది" అని శాప్ చైర్మన్ రవినాయుడు వెల్లడించారు.

రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రాథమిక పోటీల్లో సుమారు 2.07 లక్షల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారనీ జిల్లా స్థాయిలో సుమారు 84వేల మంది పోటీపడ్డారని రవినాయుడు వివరించారు
తిరుపతిని ఆధ్మాత్మికంగానే కాకుండా క్రీడా డెస్టినేషన్ గా మార్చడానికి అన్ని సదుపాయలు కల్పించాం అని శాప్ చైర్మన్ రవినాయుడు, క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.

క్రీడా గ్రామంగా మారిన తిరుపతి


రెండో రోజు మంగళవారం శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు అనేక క్రీడాలను లాంఛనంగా ప్రారంభించారు.

తిరుపతి వేదికగా నిర్వహిస్తున్నఅమరావతి ఛాంపియన్‌షిప్–2026 పోటీలకు జిల్లా స్థాయిలో సత్తా చాటిన 9,911 మంది క్రీడాకారులు తరలివచ్చారు. వారి మధ్య పోటీపోటీగా క్రీడలు జరుగుతున్నాయి. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం సమీపంలోని తారకరామా స్టేడియం, ఎస్సీ ఆర్ట్స్ కాలేజీ, ఎస్వీ హైస్కూల్ ప్రాంగణాల్లోని క్రీడా మైదానంలో ఈ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి.
12 క్రీడా విభాగాల్లో అండర్–17, అండర్–23 కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ, యూనివర్సిటీ స్థాయిల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికితీయడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
"ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రూ.92 లక్షల ప్రైజ్ మనీతో పాటు గుర్తింపు, ప్రోత్సాహకాలు అందిస్తాం" అని శాప్ చైర్మన్ రవి నాయుడు వెల్లడించారు.

క్రీడల అభివృద్దికి కేంద్రం అండ


కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలోని క్రీడా మైదానాల అభివృద్ధికి 2025లో రూ.75కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి తెలిపారు. ఈ ఏడాది కూడా సుమారు రూ.200–250 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతులను భారీగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్రీడా కోటా రిజర్వేషన్‌ను రెండు నుంచి మూడు శాతానికి పెంచడంతో పాటు, డీఎస్సీ ద్వారా 382 క్రీడా కోటా పోస్టులను భర్తీ చేసి ఉపాధ్యాయ ఉద్యోగాలకు అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.

స్పోర్ట్స్ హబ్ గా తిరుపతి

తిరుపతి అంటే శ్రీవారి దర్శనం గుర్తుకు వచ్చేదని, ఇప్పుడు తిరుపతి అంటే స్పోర్ట్స్ తిరుపతి అంటే స్పోర్ట్స్ హబ్ అనే స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నట్లు SAAP ఛైర్మన్ రవి నాయుడు తెలిపారు. తిరుపతి గొల్లవానికుంటలో క్రీడా ప్రాంగణం, మహిళా విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం, ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్స్ పునరుద్ధరణ, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.

Read More
Next Story