x
తిరుపతి తారకరామ స్టేడియంలో వాలీబాల్ సర్వీస్ చేస్తున్న కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్

వాలీబాల్ కోర్టులో దుమ్ము రేపిన తిరుపతి కలెక్టర్!

తిరుపతి తారకరామ స్టేడియంలో ఘనంగా అమరావతి ఛాంపియన్ షిప్ 2026 పోటీలు ప్రారంభం


Click the Play button to hear this message in audio format

నిత్యం పరిపాలన వ్యవహారాల్లో బిజీగా ఉండే తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ సాలిజామల వెంకటేశ్వర్ వాలీబాల్ కోర్టులో ప్రత్యర్థి యువజట్లను ఢిఫెన్స్ లో పడేశారు. సర్వీస్ చేయడంలోనే కాకుండా క్రీడల్లో తనకు ఉన్న పట్టును ఆయన ప్రదర్శించిన తీరు అందరినీ ఫిదా చేసింది.

తిరుపతి పట్టణంలోని తారకరామ స్టేడియంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్–2026 తిరుపతి జిల్లా స్థాయి పోటీలు ఆదివారం శాప్ చైర్మన్ రవి నాయుడు,. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు.

తిరుపతిలో వాలీబాల్ క్రీడా పోటీలను కలెక్టర్ డాక్టర్. వి. వెంకటేశ్వర్ లాంఛనంగా ప్రారంభించారు. ఒకపక్క జట్టులో యువక్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు. సర్వీస్ చేయడం, ఢిఫెన్స్, కట్ కొట్టడం తోపాటు క్రీడాకారులకు ఏమాత్రం తగ్గకుండా వాలీబాట్ కోర్టులో ఆయన ప్రదర్శించిన క్రీడాపటిమ ఆకట్టుకుంది. అంతకుముందు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడారు.


"అమరావతి ఛాంపియన్ షిప్ -2026 లో పాల్గొంటున్న క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేందుకు శిక్షణ ఇవ్వనున్నాం" అని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.


పట్టణాల్లోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల ప్రతిభకు పదును పెట్టడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు చెప్పారు. ఉత్తమ క్రీడాకారులను తయారు చేసి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే అమరావతి ఛాంపియన్‌షిప్–2026 పోటీల ప్రధాన ఉద్దేశమని రవినాయుడు తెలిపారు.

రాష్ట్రంలో ఈ పోటీలను అండర్–17, అండర్–23 రెండు విభాగాల్లో, మొత్తం 12 క్రీడాంశాల్లో నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ పోటీలు చక్కటి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.


అనంతరం, వాలీబాల్ పోటీలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్, శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఎం. సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జీ. నరసింహ యాదవ్, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం చైర్మన్ మహేష్ యాదవ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోటా వాసు, శాప్ బోర్డ్ డైరెక్టర్ రజనీ పాల్గొన్నారు.

Read More
Next Story