తెలుగు తెరపై  మాయమైన పూజా హెగ్డే,  కక్కుర్తే కొంపముంచిందా?
x

తెలుగు తెరపై మాయమైన పూజా హెగ్డే, కక్కుర్తే కొంపముంచిందా?

కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తూ , ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హఠాత్తుగా ఆఫర్స్ తగ్గిపోయి తెలుగు తెర నుంచి మాయమైపోయింది.

కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తూ , ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హఠాత్తుగా ఆఫర్స్ తగ్గిపోయి తెలుగు తెర నుంచి మాయమైపోయింది. ఏదో బ్యాన్ విధించినట్లుగా ఆమె ఏ సినిమాలోనూ కనిపించటం లేదు. దాంతో ఆమే తెలుగులో చేయనని నిర్ణయించుకుందా లేక ఏదన్నా అనారోగ్యమా ఇవన్ని కాక ఆమెకు ఆఫర్స్ రావటం లేదా అనే సందేహాలు సామాన్య సినిమారావుని సరదాపడి మరీ పలకరిస్తాయి. ఆమె ఫొటోనో లేక ఆమె సినిమానో మళ్లీ యూట్యూబ్ లోనో లేక టీవిలోనో చూసినప్పుడు ఒక్క క్షణం ఆగిపోయి ఆలోచనలో పడిపోతారు. అవును ఇప్పుడు మీకు కూడా సందేహం వస్తోంది కదా పూజ ఏమై పోయిందని.

2012లో తమిళ చిత్రం మూగమూడి తో పూజా హెగ్డే హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించింది. ఆ సినిమా వచ్చిన రెండేళ్ల తర్వాత తెలుగులోకి నాగచైతన్య సినిమా ఒక లైలా కోసం తో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడీగా పూజా హెగ్డే నటించింది. నెక్స్ట్ ముకుంద సినిమాలో వరుణ్ తేజ్ తో జతకట్టింది. పూజా హెగ్డే మొదటి మూడు సినిమాలు సౌత్ లో పెద్దగా సక్సెస్ కాలేదు.

దాంతో హిందీకి వెళ్లి హృతిక్ రోషన్ సరసన మోహింజదారో సినిమా చేసింది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. మళ్లీ తెలుగుకు వచ్చి అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథమ్ చేసి పూజా మొదటి కమర్షియల్ హిట్ అందుకుంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా జెట్ స్పీడ్ తో పూజా హెగ్డే కెరియర్ కొనసాగింది. అయితే ఆ తర్వాతే వరస ఫెయిల్యూర్స్ పలరించటం మొదలయ్యాయి.

అయితే 2022లో పూజా హెగ్డే నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో ప్రభాస్ రాధేశ్యామ్ కూడా ఉండటం విశేషం. అయితే ఈ నాలుగు సినిమాలలో మూడు డిజాస్టర్ అయ్యాయి. బీస్ట్ మూవీ మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 2023లో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి జోడీగా నటించిన కిసీకా భాయ్ కిసీకి జాన్ మూవీ రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. అదే సమయంలో మహేష్ బాబు గుంటూరు కారంతో పాటుపవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలలో ఛాన్స్ లని పోగొట్టుకుంది. అప్పట్లో మహేష్ కోరిక మేరకు గుంటూరు కారం నుంచి పూజను వద్దని శ్రీలీలను రీప్లేస్ చేసారు అని అంటారు. అయితే పూజతో అందరికి వచ్చిన సమస్య ఏమిటి, ఆమెను తమ సినిమాల్లో మూకుమ్మిడిగా ఎందుకు వద్దనుకున్నారు.

ఫెయిల్యూర్స్ తర్వాత కూడా పూజకు కంటిన్యూగా ఆపకుండా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. తెలుగు నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో తీసుకోవాలనే ఉత్సాహంతోనే ఉన్నారు. అయితే సమస్య అంతా ఆమె ప్యాకేజీతోనే అంటున్నారు. పూజ హెగ్డే ని తమ సినిమాల్లోకి తీసుకోవాలంటే ఆమె డిమాండ్స్ బోలెడు ఉన్నాయట. ఆమె ప్రతీ సినిమాకు బిజినెకస్ క్లాస్ టిక్కెట్స్ అడుగుతుంది.అలాగే స్టార్ హోటల్ ఎకామ్డేషన్ అడుగుతుంది. తనొక్కత్తికే కాకుండా తన స్టాఫ్ అందరికీ కూడా తనతో సమానంగా సౌకర్యాలు చూడాలంటుంది. దాంతో బడ్జెట్ తడిసిమోపెడు అవుతోంది. ఏం హీరోలకు అంతంత ఖర్చుపెడుతున్నప్పుడు తమకు ఖర్చుపెట్టడంలో తప్పేముందని ఆమె వెర్షన్ కావచ్చు. అయితే వాటిని కక్కుర్తి అంటోంది ఇండస్ట్రీ. ఆమెకు ఇచ్చే రెమ్యునరేషన్ లోనే అవన్నీ చూసుకోవాలి కానీ నడుస్తోంది కదా అని నిర్మాతల మీద రుద్దితే ఎలా అనేది నిర్మాతల వాదన.

అయినా ఇది హీరో డామినేటెడ్ ఇండస్ట్రీ. లెక్కలు వేరుగా ఉంటాయి. అయితే డిమాండ్స్ అన్నీ ఆమె ఫామ్ లో ఉన్నప్పుడు బాగానే చెల్లు బాటు అయ్యాయి. అగ్గగ్గలాడుతూ అడిగిందల్లా ఇచ్చేసారు. కానీ ఫెయిల్యూర్స్ లోకి రాగానే ఒక్కసారిగా అన్నీ మాయమైపోయాయి. అలాగని పూజ వాస్తవ పరిస్దితుల్లోకి వచ్చి తనను తాను తగ్గించుకోలేక సినిమాలు తగ్గించుకుంటు పోయింది. ఫామ్ లో ఉన్నప్పుడు వాళ్లంతట వాళ్లే పలకరించినవాళ్లు వెనకబడ్డాక...ఫోన్ కూడా లిప్ట్ చేయరనే వాస్తవం తెలొసివచ్చింది ఆమె.

ఇక పూజ చేతిలో సాయి తేజ్ సరసన కమిటైన చిత్రం మిగిలింది. రీసెంట్ గా ఆ ప్రాజెక్టు కూడా ఓటిటి సమస్యలతో కాన్సిల్ అయ్యింది. దాంతో ఇప్పుడు పూజ కెరీర్ డైలమోలో పడింది. తెలుగులో రీలాంచ్ అవ్వాలనుకుంటోంది. అలాగని మీడియం హీరోల సరసన ఆమె చెయ్యాలనుకోవటం లేదు. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే తన రెమ్యునరేషన్ తగ్గిస్తానిని, స్టార్ ఖర్చు కూడా తనే భరిస్తానని కబుర్లు పంపుతోందిట.ప్రస్తుతం పూజ ..హిందీలో షాహిద్ కపూర్ సరసన, తమిళంలో సూర్య సరసన మరో సినిమా చేస్తోంది.

దక్షిణాది సినిమాపై ఫోకస్‌ చేస్తే, ఎప్పుడూ నాలుగు సినిమాలు చేతిలో ఉంటాయని అని భావిస్తోంది పూజా. ఆల్రెడీ సూర్యతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో తమిళంలో వరుసగా సినిమాలు వచ్చేస్తాయనే ధీమా కనిపిస్తోంది పూజా హెగ్డేలో.పూజా హెగ్డే అనగానే అరవింద సమేతను, అల వైకుంఠపురములో సినిమాను గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు. ఆమె, వాటిని మించే సినిమాలు చేస్తే చూడాలని ఆశించటంలో తప్పేమీ లేదు.

పూజ తన స్ట్రాటజీ మార్చుకుని మళ్లీ తెలుగు తెరపై కనిపించటానికి సన్నాహాలు చేస్తోంది. ఓ ప్రొడక్షన్ కంపెనీ ఓ స్టార్ హీరో సరసన ఆమెను చూపించటానికి సన్నాహాలు చేస్తోంది. గతంలో ఆమె వర్క్ చేసిన దర్శకుడు, హీరో కాంబినేషన్ లోనే ఆమె కనిపించబోతోంది అంటున్నారు. అయితే ఇంకా ఎగ్రిమెంట్ కూడా కానీ ఈ స్టేజిలో ఈ విషయం మాట్లాడటం, డిటేల్స్ ఇవ్వటం పద్దతి కాదంటున్నారు. గతంలో చేసి, సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు , హీరో అంటే చాలా మందికి ఈ పాటికి వెలిగే ఉంటుంది. అదీ విషయం.

Read More
Next Story