
Kerala Congress unit chief Sunny Joseph
కేరళలో యూడీఎఫ్ దూకుడు..
100 సీట్ల దిశగా కాంగ్రెస్ ధీమా.. తొలిరౌండ్లోనే వెనకబడిన మంత్రులు
కేరళలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి గంట తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ముందంజలో ఉంది. ఇది తమకు అనుకూలమైన ట్రెండ్ అని కేరళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సన్నీ జోసఫ్ (Sunny Joseph) తెలిపారు. యూడీఎఫ్ 100 సీట్ల మార్క్ను చేరుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
“ఇది రాష్ట్రంలో యూడీఎఫ్కు అనుకూలమైన ట్రెండ్ను సూచిస్తోంది. మేము 100 సీట్లను చేరుకుంటాం,” అని ఆయన ఒక టీవీ ఛానల్తో అన్నారు.
ఇటు సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సుమారు 40 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 140 మొత్తం సీట్లలో ఐదు స్థానాల్లో ముందంజలో ఉంది.
అలాగే ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan)తో పాటు రాష్ట్ర మంత్రులలో ఎక్కువ మంది మొదటి రౌండ్లోనే వెనుకబడినట్లు సమాచారం.
Next Story

