‘ఓటింగ్‌ను మరో 2 గంటలు పొడిగించండి’
x

‘ఓటింగ్‌ను మరో 2 గంటలు పొడిగించండి’

ఎన్నికల కమిషన్‌కు TVK లేఖ..


Click the Play button to hear this message in audio format

చెన్నై మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఓటింగ్ సమయాన్ని రెండు గంటల పాటు పొడిగించాలని టీవీకే (TVK) ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ గురువారం విజ్ఞప్తి చేశారు.

“గుడువాంచేరి, చెంగల్పట్టు ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ పరిస్థితుల్లో చాలా మంది ఓటు వేయే అవకాశాన్ని కోల్పోతారు. ఓటింగ్‌ సమయాన్ని రెండు గంటల పొడిగించాలని (రాత్రి 8 గంటల వరకు) ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాం,” అని ఆనంద్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో కూడా చర్చించినట్లు ఆయన చెప్పారు.

అలాగే ఎన్నికల సమయంలో పాలన పనితీరుపై కూడా ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. “ముగ్గురు ఐఏఎస్ అధికారులపై విచారణ జరపాలని కూడా మేం కోరుతున్నాం,” అని ఆయన పేర్కొన్నారు. అయితే ఇందుకు కారణాలను మాత్రం వెల్లడించలేదు.

నీలాంకరైలో ఓటు వేసిన విజయ్..

నటుడు,రాజకీయ నాయకుడు విజయ్ నీలాంకరైలోని ఒక పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించారు. ఆయన అక్కడి ఒక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైకిల్‌పై వచ్చి ఓటు వేసిన విజయ్, ఈసారి కారులో వచ్చి ఓటు వేశారు.

రెండు కీలక నియోజకవర్గాల నుంచి పోటీ..

విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అవి చెన్నైలోని పెరంబూర్‌, తిరుచిరాపల్లి ఈస్ట్. పెరంబూర్‌లో, గత ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అభ్యర్థి ఎన్ ఆర్ ధనపాలన్‌పై 54,976 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన డీఎంకే నేత ఆర్‌డి శేఖర్‌తో విజయ్ పోటీ పడుతున్నారు. తిరుచిరాపల్లి ఈస్ట్‌లో, 2021 ఎన్నికల్లో 53,797 ఓట్ల మెజారిటీతో గెలిచిన ప్రస్తుత డీఎంకే ఎమ్మెల్యే ఇనిగో ఇరుదయరాజ్ ఎస్‌తో విజయ్ పోటీ చేస్తున్నారు.

“మొత్తం ఓటర్ల సంఖ్య 5.73 కోట్లు కాగా.. ఇందులో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులు, 7,728 మంది థర్డ్ జెండర్ ఉన్నారు” అని వివరించారు తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) అర్చన పట్నాయక్. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లు 14,59,039 మంది ఉన్నారని ఆయన తెలిపారు.

Read More
Next Story