ఎన్నికల ముందు ఎక్కువవుతున్న జంప్ జిలానీలు
x
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ, ప్రతిపక్ష నేత గౌరవ్ గొగోయ్

ఎన్నికల ముందు ఎక్కువవుతున్న జంప్ జిలానీలు

అస్సాం ఎన్నికల ముందు చిత్రాలు


అస్సాంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా జ‌రుగుతున్నాయి. కాంగ్రెస్ నేత బోరా ఇటీవ‌లె బీజేపీలో చేరడం వివాదాస్ప‌ద‌మైంది. అస్సాం ఎన్నికల ముందు ఆయ‌న కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఇక్క‌డ‌ జరుగుతున్న నేతల మార్పిడి అస్పాం కాంగ్రెస్ ను ఇర‌కాటంలో ప‌డేసింది.

అస్సాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేప‌థ్యంలో నేతల మార్పిడి మళ్లీ మొదలైంది. కాంగ్రెస్ ప్ర‌త్యర్థి పార్టీల అసంతృప్తి నాయకులను ఆయా పార్టీలు త‌మ వైపు తిప్పుకోవ‌డానికి ప్రయత్నిస్తున్నాయి.
మళ్లీ టికెట్ దొరకకపోవచ్చు అని భావిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యేలను త‌మ వైపు తిప్పుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇందుకు మరో కారణం నియోజకవర్గాల పునర్విభజన. కొన్ని నియోజకవర్గాలు రిజర్వ్ లేదా సాధారణ సీట్లుగా మారడం వల్ల, కొన్ని ప్రస్తుత ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకుండా ఉండడానికి పార్టీలకు అవకాశం వచ్చింది.
బోరా సీటు మ‌రో మారువివాదం మాజీ అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపెన్ బోరా బిజెపిలో చేరడం కాంగ్రెస్‌కు పెద్ద షాక్ త‌గిలింది. ఆయన ఈసారి బిహ్పురియా సీటు కాకుండా రంగోనాడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నార‌ని అని సమాచారం.
గత రెండు ఎన్నికల్లో బిహ్పురియా నుంచి ఓడిపోయిన బోరా, క‌మ‌లం పార్టీ నుంచి రంగోనాడి టికెట్ పొందే హామీ పొందారని చాలా మంది భావించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బోరాకు క‌మ‌లం పార్టీ టికెట్ ఇచ్చారని సమాచారం. అయితే ఆయన బిహ్పురియా లేదా రంగోనాడి నుంచి పోటీ చేస్తారా అనేది ఇంకా ఖరారు కాలేదు.
బిహ్పురియా నుంచి పోటీ చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్ తన సీటును కోల్పోవ‌ల్సి వస్తుంది. క‌మ‌లం పార్టీ లో అంతర్గత కుమ్ములాట
బోరా క‌మ‌లం పార్టీలో లో చేరడం వల్ల పార్టీ లోపలే కొంత అసంతృప్తి పెరిగింది. మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ అనుచరులు దీనిపై అసంతృప్తిగా ఉన్నారు.
కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు క‌మ‌లం పార్టీలో లో విభేదాలు పెంచడానికి య‌త్నిస్తున్నారు. కనీసం 12 మంది క‌మ‌లం పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌లో కూడా ముదిరిన విభేధాలు కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాట‌లు ఉన్నాయి.
కొంతమంది ప్రస్తుత ఎమ్మెల్యేలు తమకు టికెట్ రాకపోవచ్చు అని భావించి ఇతర పార్టీలతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. జాదబ్ స్వార్గియారి (దుధ్నై ఎమ్మెల్యే) పార్టీని విడిచే అవకాశముంది. రెకిబుద్దిన్ అహ్మద్ (చాయ్‌గావ్ ఎమ్మెల్యే) ఎ.కె. రషీద్ అలం (గోపాల్పారా ఈస్ట్ ఎమ్మెల్యే) క‌మ‌లం పార్టీ మిత్రపక్షం అస్సాం గ‌ణ ప‌రిష‌త్ తో తో చర్చలు జరుపుతున్నారు.
Read More
Next Story