
విజయ్కు అభినందనలు..దీదీపై సానుభూతి:జగన్ ఆసక్తికర పోస్ట్
సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోన్న జగన్ పోస్టు
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ సృష్టించిన ప్రభంజనంపై వైఎస్ జగన్ స్పందించారు. ’నా సోదరుడు విజయ్కు హృదయపూర్వక అభినందనలు. మీరు పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం సాధారణ విషయం కాదు, ఇది నిజంగా గొప్ప విజయం‘ అని కొనియాడారు. వెండితెరపై దళపతిగా మెప్పించిన విజయ్, ఇప్పుడు ప్రజాసేవలో మొదలుపెడుతున్న ఈ కొత్త ప్రయాణం దిగ్విజయంగా సాగాలని, ఆయనకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని జగన్ ఆకాంక్షించారు.
దీదీకి సానుభూతి..విజేతలకు శుభాకాంక్షలు
ఇదే క్రమంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై కూడా జగన్ స్పందించారు. సుదీర్ఘ కాలం బెంగాల్ను పాలించి, ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (దీదీ) పట్ల ఆయన తన సానుభూతిని వ్యక్తం చేశారు. అదే సమయంలో, బెంగాల్లో జయకేతనం ఎగురవేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పాటు, ఇతర రాష్ట్రాల్లో విజయం సాధించిన విజేతలందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు.
రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
జగన్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో విజయ్ సాధించిన ఘనతను గుర్తించడమే కాకుండా, ఆయనను 'సోదరుడు అని సంబోధించడం ఇరు నేతల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటిచెబుతోంది. అలాగే బెంగాల్ ఫలితాలపై స్పందిస్తూనే, విజేతలకు అభినందనలు తెలపడం ద్వారా జగన్ తన రాజకీయ పరిణతిని చాటుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2026
My sympathies are with Didi.…
Next Story

