బీహార్‌ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం
x

బీహార్‌ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం

రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దశ ప్రారంభం


Click the Play button to hear this message in audio format

బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం (ఏప్రిల్ 15) ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలో ఈ పదవిని చేపట్టిన కాషాయ పార్టీకి చెందిన తొలి నేతగా ఆయన నిలిచారు. పాట్నాలోని లోక్ భవన్‌లో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయనతోపదవీ ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అగ్రనేతలు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, చిరాగ్ పాశ్వాన్, శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. అలాగే జేడీ(యూ)కు చెందిన విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ మంత్రివర్గంలో సభ్యులుగా ప్రమాణం చేశారు.

దాదాపు రెండు దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ తన మంత్రివర్గాన్ని రద్దు చేసి, ఈ మార్పునకు మార్గం సుగమం చేశారు. సామ్రాట్ చౌదరి రాజకీయ ప్రయాణం ప్రత్యేకంగా నిలిచింది. ముంగేర్ జిల్లాకు చెందిన ఆయన, మొదట లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం 2017లో బీజేపీలో చేరి వేగంగా ఎదిగారు. ఉప ముఖ్యమంత్రిగా, హోం శాఖ మంత్రిగా పనిచేసి తన పరిపాలనా సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.

కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన ఆయనను బీజేపీ ఓబీసీ వర్గాల్లో కీలక నాయకుడిగా ప్రోత్సహిస్తోంది. యాదవేతర ఓబీసీ వర్గాల మద్దతును బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగా ఆయన ఎంపిక జరిగినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ పరిణామం బీహార్ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. సంకీర్ణ భాగస్వామిగా ఉన్న బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యక్ష అధికార కేంద్రంగా ఎదుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Read More
Next Story