షీ జిన్ పింగ్ తో భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
x
చైనా అధ్యక్షుడి షి జిన్ పింగ్ తో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

షీ జిన్ పింగ్ తో భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

పశ్చిమాసియా సంక్షోభం, తైవాన్ విషయాలతో పాటు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనాలో పర్యటిస్తున్నారు. ట్రంప్ కు చైనా సాంప్రదాయ శైలితో స్వాగతం పలికింది. స్వాగత సూచకంగా ఫిరంగులు గర్జించగా, ఒక బృందం 'స్టార్-స్ప్యాంగిల్డ్ బ్యానర్'ను వాయించింది.

అనంతరం షీ జిన్ పింగ్, ట్రంప్ సైనిక గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమం కోసం టియానన్‌మెన్‌ను ఖాళీ చేయించారు. అధికారులు, పత్రికా ప్రతినిధులు, అలాగే ట్రంప్ రాక తర్వాత కవాతు చేస్తూ వచ్చిన సైనిక సిబ్బంది తప్ప ప్రాంగణంలో మరే కదలికా లేదు.

ఆ హాలులో ఎర్ర తివాచీలు పరిచిన భారీ మెట్లు, విశాలమైన పాలరాతి ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ సైనికులు పెద్ద అమెరికన్, చైనీస్ జెండాలను ఎగురవేశారు. ప్రకాశవంతమైన రంగుల దుస్తులు ధరించిన వందలాది ప్రాథమిక పాఠశాల పిల్లలు స్వాగత ప్రదర్శన ఇచ్చారు.

ఆ ఇద్దరు నాయకులు వారి పక్కగా నడుచుకుంటూ వెళ్తుండగా, బాలికలు పువ్వులు ఊపుతూ, బాలురు అమెరికన్, చైనీస్ జెండాలను ఎగురవేస్తూ పైకి కిందకి డ్యాన్స్ చేశారు. ఈ కీలకమైన సమావేశంలోని కొన్ని ముఖ్యాంశాలు

1. తైవాన్‌పై షీ జిన్ పింగ్ హెచ్చరిక

తైవాన్ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే, ఇరు దేశాల మధ్య ఘర్షణలు చెలరేగుతాయని, ఇది చైనా-అమెరికా సంబంధాలను "చాలా ప్రమాదకరమైన స్థితికి" తీసుకువెళ్తుందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చెప్పినట్లు చైనా ప్రభుత్వ మీడియా జిన్హువా నివేదించింది.
ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగిస్తున్న తైవాన్‌ను చైనా తన భూభాగంగా పరిగణిస్తుంది. ఈ వాదనను తైపీ తిరస్కరిస్తుంది. ఆ ద్వీపానికి అమెరికా ఆయుధాల అమ్మకాలను చైనా వ్యతిరేకిస్తుంది. అమెరికా ఆ ద్వీపానికి తన 'స్పష్టమైన, దృఢమైన మద్దతును పునరుద్ఘాటించింది'.
ఈ సమస్యను సరిగ్గా పరిష్కరిస్తే, ద్వైపాక్షిక సంబంధాలు సాధారణంగా స్థిరంగా కొనసాగగలవు. "దీనిని సరిగ్గా నిర్వహించకపోతే, రెండు దేశాలు ఢీకొనవచ్చు లేదా సంఘర్షణలోకి కూడా రావచ్చు.
ఇది మొత్తం చైనా-అమెరికా సంబంధాన్ని అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి నెట్టివేస్తుంది." తైవాన్ స్వాతంత్య్రం అని పిలవబడేది తైవాన్ జలసంధిలో శాంతితో "ప్రాథమికంగా పొసగదు" అని చైనా నాయకుడు అన్నారు. " జలసంధిలో శాంతి అనేది చైనా - యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉన్న అతిపెద్ద ఉమ్మడి అంశం" అని ఆయన అన్నారు.

2. కాంగ్రెస్ లో బలమే ముఖ్యం..

నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నికల ముందు, రిపబ్లికన్లు కాంగ్రెస్‌పై తమ నియంత్రణను నిలుపుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే చైనాతో పాటు, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం, క్షీణిస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ వంటివి ట్రంప్ మెడపై కత్తిలా వేలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజింగ్ పర్యటన సాగింది.
ఇరాన్‌లో అమెరికా - ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం హార్ముజ్ జలసంధిని వాస్తవంగా మూసివేయడానికి దారితీసింది. దీనివల్ల చమురు, సహజ వాయువు ట్యాంకర్లు చిక్కుకుపోయి, ఇంధన ధరలు విపరీతంగా పెరిగి, ప్రపంచ ఆర్థిక వృద్ధికి ముప్పు వాటిల్లుతోంది.
చైనా అధ్యక్షుడితో పలు విషయాలను ట్రంప్ చర్చించే అవకాశం ఉంది. వీటిలో ఇరాన్, వాణిజ్య యుద్దాలు, తైవాన్, వాషింగ్టన్, బీజింగ్, మాస్కోల మధ్య మాత్రమే కుదిరే అవకాశం ఉన్న త్రైపాక్షిక అణు ఆయుధ ఒప్పందం వంటివి ఉన్నాయి. అయితే ఇవి పురోగతి సాధించే అంశాలు చాలా తక్కువగా ఉంటాయని సెంటర్ ఫర్ యూరోపియన్ పాలసీ అనాలిసిస్ లో టెక్ ఫెలో అయిన జిమ్ లూయిస్ అంచనా వేశారు.

3. సహకారానికే ప్రాధాన్యం..

రెండు అగ్రదేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, ప్రాంతీయ భద్రతకు సంబంధించి ప్రత్యక్ష, పరోక్ష ఘర్షణలు జరుగుతున్నప్పటికీ ఇరు దేశాధినేతలు మాత్రం పరస్పరం పలకరింపులతో ఆశావాదంతో చర్చలు కొనసాగించారు. రెండు దేశాలు "భాగస్వాములుగా ఉండాలి, ప్రత్యర్థులుగా కాదు" అని జిన్ పింగ్ అన్నారు. అయితే "పరస్పర" వాణిజ్యంపై చర్చించడానికి అమెరికా ప్రతినిధి బృందం ఎదురుచూస్తోందని ట్రంప్ చెప్పారు.

4. థుసిడైడ్స్ ట్రాప్..

ఈ రోజు ఉదయం షీ జిన్ పింగ్ తన ప్రసంగంలో 'థుసిడైడ్స్ ట్రాప్' గురించి ప్రస్తావించారు. హార్వర్డ్ ప్రొఫెసర్ గ్రాహం అల్లిసన్ ప్రాచుర్యంలోకి తెచ్చిన ఈ సిద్ధాంతం, వర్ధమాన దేశానికి, ఇప్పటికే స్థిరపడిన శక్తికి మధ్య యుద్ధం జరిగే అధిక ప్రమాదాన్ని సూచిస్తుంది.
"ప్రపంచం ఒక కొత్త కూడలికి చేరుకుంది. చైనా -యునైటెడ్ స్టేట్స్ ఈ 'థుసిడైడ్స్ ట్రాప్' అని పిలవబడే దానిని అధిగమించి, ప్రధాన దేశాల మధ్య సంబంధాలలో ఒక కొత్త నమూనాను సృష్టించగలవా?" అని అన్నారు. వీటి గురించి కాస్త వివరంగా చెప్పాలంటే వర్ధమాన శక్తి ఇప్పటికే ఉన్న శక్తిని బెదిరించినప్పుడు సంఘర్షణకు దారితీసే ధోరణిని వివరించే పదాన్ని 'థుసిడైడ్స్ ట్రాప్' అంటారు.
స్పార్టా - ఏథెన్స్ మధ్య జరిగిన ప్రాచీన గ్రీకు యుద్ధాన్ని సూచించే ఈ భావనను, షీ అమెరికా-చైనా సంబంధాలలో అనేక కీలక సందర్భాలలో చర్చించారు. వాటిలో 2014 నాటి ఒక ఇంటర్వ్యూ, 2015లో అమెరికాలో ఆయన అధికారిక పర్యటన 2024లో పెరూలో అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన జరిపిన సమావేశం కూడా ఉన్నాయి.

5. సాధ్యమయ్యే వాణిజ్య ఒప్పందాలు?

ట్రంప్ స్పష్టమైన ఫలితాలు సాధించడానికే చైనా వెళ్లారని వైట్ హౌజ్ వెల్లడించింది. అమెరికా నుంచి సోయాబీన్స్, గొడ్డు మాంసం, విమానాలను కొనుగోలు చేయడానికి చైనా కట్టుబడి ఉండటంతో సహా, వాణిజ్యంపై ప్రకటనలు వెలువడవచ్చని వాషింగ్టన్ భావిస్తోంది.
దేశాల మధ్య వాణిజ్యపరమైన విభేదాలను పరిష్కరించడానికి, చైనాతో కలిసి ఒక వాణిజ్య మండలిని ఏర్పాటు చేసే దిశగా కూడా ట్రంప్ పరిపాలన అధికారులు కృషి చేయాలనుకుంటున్నారు. ఈ వాణిజ్య మండలి "ప్రాథమికంగా నియంత్రిత వాణిజ్యం కోసం ఒక యంత్రాంగంగా ఉంటుంది.
దీనిలో ఇరుపక్షాలు కోటాలు, స్వచ్ఛంద ఎగుమతి నియంత్రణల వంటి పురాతన వాణిజ్య సాధనాలను ఉపయోగిస్తాయి". ఒకరిపై ఒకరు అధిక సుంకాలను విధిస్తామన్న బెదిరింపులను శాంతపరుస్తూ, గత సంవత్సరం అమెరికా - చైనా ఒక వాణిజ్య సంధికి చేరుకున్నాయి.
ఈ ఒప్పందాన్ని పొడిగించడంపై చర్చలు కొనసాగుతున్నాయని, పరస్పర ఆసక్తి ఉందని వైట్ హౌస్ చెబుతోంద. అయితే ట్రంప్ పర్యటన సందర్భంగా అటువంటి ప్రకటన ఏదైనా వెలువడుతుందో లేదో స్పష్టంగా తెలియదు. అమెరికా సంస్థలకు చైనా మార్కెట్‌లోకి మరింత ఎక్కువ ప్రవేశం కల్పించాలని తాను జిన్ పింగ్ ని కోరతానని ట్రంప్ చెప్పారు. అలాగే అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేయడంలో అవాంతారాలు లేకుండా చూడాలని ట్రంప్, చైనాను కోరే అవకాశం ఉంది.

6. ఇరాన్ యుద్ధంపై..

ఇరాన్ చమురును అత్యధికంగా కొనుగోలు చేసే దేశం చైనా. ఫాక్స్ న్యూస్‌కు చెందిన సీన్ హన్నిటీతో ఒక ఇంటర్వ్యూలో విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ, ఇరాన్‌పై తన ప్రభావాన్ని చూపాలని బీజింగ్‌ను ఒప్పించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తారని చెప్పారు.
ప్రస్తుతం హార్ముజ్ లో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అలాగే చైనా వస్తువులకు మార్కెట్ సైతం పరిమితం అయ్యే అవకాశం ఉంది. "కాబట్టి దీనిని పరిష్కరించుకోవడం వారి ప్రయోజనాలకు మంచిది" అని చైనా అధికారుల గురించి రూబియో అన్నారు.
"పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్ ఇప్పుడు చేస్తున్న, చేయడానికి ప్రయత్నిస్తున్న పనుల నుంచి వైదొలగేలా చేయడంలో మరింత చురుకైన పాత్ర పోషించేలా వారిని ఒప్పించాలని మేము ఆశిస్తున్నాము" అన్నారు.

7. తైవాన్ చర్చలు..

తైవాన్ హోదా ఒక పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే చైనా ప్రభుత్వం తమ భూభాగంలో భాగంగా పేర్కొంటున్న ఈ స్వయం-పరిపాలన ద్వీపానికి ఆయుధాలు అమ్మాలన్న అమెరికా ప్రణాళికలతో చైనా అసంతృప్తిగా ఉంది. ట్రంప్ ప్రభుత్వం తైవాన్ కోసం 11 బిలియన్ డాలర్ల ఆయుధ ప్యాకేజీని ఆమోదించింది.
కానీ దానిని ఇంకా అమలు చేయలేదు. తైవాన్ పట్ల ట్రంప్ సంశయాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ వైఖరి, ఆ ద్వీప ప్రజాస్వామ్య దేశానికి ఆయన మద్దతును తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది.
తైవాన్ ప్రపంచంలోనే అగ్రగామి చిప్ తయారీదారు, ఇది కృత్రిమ మేధస్సు అభివృద్ధికి అవసరమైన భాగాలను ఉత్పత్తి చేస్తుంది. అమెరికాలో చిప్ ఉత్పత్తిని ఉత్తేజపరిచేందుకు తైవాన్‌తో వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేయడానికి ట్రంప్ ప్రయత్నించారు.
ట్రంప్ పాటు వెళ్లిన ప్రతినిధి బృందంలో భాగంగా ఉన్న టెక్, రక్షణ, ఆర్థిక, వ్యవసాయ రంగాలకు చెందిన పెద్ద సంఖ్యలోని సీఈఓలలో ఎన్విడియాకు చెందిన జాన్సన్ కూడా ఒకరు. ఫెడరల్ ఉద్యోగాలను తగ్గించి, ప్రభుత్వ పరిమాణాన్ని కుదించాలన్న ట్రంప్ ప్రయత్నానికి ఒకప్పుడు నాయకత్వం వహించిన స్పేస్‌ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కూడా చైనాలో ఉన్నారు.
Read More
Next Story