
రష్యా దాడిలో దెబ్బతిన్న కీవ్ లోని భవనం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రం..
కీవ్పై భారీ క్షిపణి, డ్రోన్ దాడులు.. తొమ్మిది మంది మృతి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతమవుతోంది. శనివారం తెల్లవారుజామున రష్యా, ఉక్రెయిన్ రాజధాని కీవ్పై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో భారీ దాడులు చేసింది. ఈ దాడుల్లో కనీసం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రాజధానిలోని పలు ప్రాంతాల్లో నివాస, వాణిజ్య భవనాలు దెబ్బతినడంతో పాటు అగ్నిప్రమాదాలు సంభవించాయి.
Next Story

